
523views
వాషింగ్టన్: క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సందు.. విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు.
అమెరికా అధికారులు.. ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్, ఎయిర్ కమాండర్ అంజన్ భద్ర, నౌకాదళ కమాండర్ నిర్భయా బప్నా, అమెరికా విదేశాంగ శాఖలోని మేనేజ్మెంట్, వనరుల విభాగం డిప్యూటీ టీహెచ్ బ్రియాన్ మెక్కియాన్లు.. హాజరయ్యారు. చిరుజల్లులు కురుస్తున్నా.. మోదీ రాకకోసం వందల మంది ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి వచ్చారు. మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. వారిని మోడీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.





