News

కేంద్ర నిర్ణయంతో దిగిరానున్న వంట‌నూనెల‌ ధరలు

632views
  • దిగుమతి సుంకం తగ్గింపు

న్యూఢిల్లీ: వంట నూనెల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనె దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 5.5 శాతం తగ్గించింది. ఈ మేరకు వివిధ నూనెలకు సంబంధించి ధరల తగ్గింపు వివరాలను వెల్లడించింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో పామాయిల్‌ ధరలు 2.5 శాతం తగ్గాయి. గత వారం టన్ను పామాయిల్‌ ధర రూ. 12,666 ఉండగా ప్రస్తుతం రూ. 12,349కి చేరుకుంది.

సీసమ్‌ ఆయిల్‌ 2.08 శాతం తగ్గి టన్ను ఆయిల్‌ ధర రూ. 23,500లకు చేరుకుంది. కొబ్బరి నూనె ధరలు 1.72 శాతం తగ్గి టన్ను ఆయిల్‌ ధర రూ. 17,100లుగా ఉంది. అలాగే సన్‌ఫ్లవర్‌ నూనె ధరలు 1.30 శాతం తగ్గి టన్ను ధర రూ. 15,965లకు చేరుకుంది.

అంతకు ముందు ఈ ధర రూ.16,176 ఉండేది. ఇక వేరు శనగ నూనె ధరలు 1.28 శాతం తగ్గి హోల్‌ సేల్‌ మార్కెట్‌లో టన్ను ఆయిల్‌ ధర 16,839గా ట్రేడ్‌ అవుతోంది. వనస్పతి నూనె ధరలు 1 శాతం తగ్గి రూ. 12,508కి చేరుకుంది. అలాగే ఆవాల నూనె ధరలు సైతం 1 శాతం తగ్గి టన్ను ఆయిల్‌ ధర రూ. 16,573 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి