
-
ప్రపంచ ర్యాంకింగ్లో అక్రమాలు
-
ప్రపంచబ్యాంకు వెల్లడి
-
నిప్పులు చెరిగిన భారత్
న్యూఢిల్లీ: చైనా దొంగ బుద్ది బట్టబయలైంది. వివిధ దేశాల్లో పెట్టుబడులు, వ్యాపార అనుకూలతలను తెలిపే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నివేదికను ప్రచురించడం నిలిపివేయాలని వరల్డ్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికలో ఇచ్చే ర్యాంకింగ్స్ను తారుమారు చేసేలా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలే ఇందుకు కారణంగా తెలిసింది.
ముఖ్యంగా 2017లో చైనా ర్యాంక్ను పెంచాలని.. కొంత మంది ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని ఒత్తిడి చేసినట్టు ఇటీవల ఓ కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలు వరల్డ్ బ్యాంక్ దృష్టికి వెళ్లాయి. చైనా చేసిన అక్రమాలు ఇన్నాళ్లకు బయటపడ్డాయని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది భారత్కు కచ్చితంగా కలిసొచ్చే విషయమని పేర్కొన్నాయి. ముఖ్యంగా తయారీ పరిశ్రమలు భారత్కు తరలే అవకాశాలున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2019లో వరల్డ్ బ్యాంక్ ప్రచురించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నివేదికలో భారత్ ర్యాంక్ 14 స్థానాలు మెరుగై.. 63కి చేరింది.





