
735views
న్యూఢిల్లీ: బ్రిటన్లో సిక్కు వీరుడు హవిల్దార్ ఇషార్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 1897లో చోటు చేసుకున్న సారాగఢీ యుద్ధంలో ఆయన 20 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించి వేలాది మంది అఫ్గాన్ సైనికులతో పోరాడారు. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల గౌరవార్ధం యూకేలో పది అడుగుల ఎత్తులో ఇషార్ సింగ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
దీనిని ఇంగ్లండ్లోని వోల్వర్ హ్యాంప్టన్లోని వెడ్నస్ఫీల్డ్లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానికులతో పాటు, అనేక మంది పార్లమెంటు సభ్యులు, స్థానిక కౌన్సెలర్లు, మిలిటరీ ఆఫీసర్లు హాజరయ్యారు. సారాగఢీ స్మారక చిహ్నంపై ఉన్న ఎనిమిది మీటర్ల స్టీల్ ప్లేటు మీద పర్వత శ్రేణులు, బ్రిటిష్ అవుట్ పోస్టును ప్రతిబింబించే ఆకారంతోపాటు, యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు.





