
-
చర్చకు రానున్న అంతర్జాతీయ విషయాలు
న్యూఢిల్లీ: అమెరికాలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్(Quad-Quadrilateral Security Dialogue) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిదె సుగా పాల్గొననున్నారు. ఈ క్వాడ్ సమావేశంలో నాలుగు దేశాల నేతలు కరోనా వైరస్పై చేస్తున్న పోరాటంలో సహకారం, వాతావరణ సంక్షోభానికి పరిష్కారం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ తదితర అంశాలపై చర్చించనున్నట్టు శ్వేతసౌధం అధికార ప్రతినిధి జెన్ సాకి వెల్లడిరచారు.
ఈఏడాది మార్చిలో మొట్టమొదటిసారిగా జరిగిన క్వాడ్ సమావేశాన్ని కరోనా కారణంగా వర్చువల్గా నిర్వహించారు. ఆ భేటీలో పాల్గొన్న అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాధినేతలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏకపక్ష ఆధిపత్యవైఖరి నేపథ్యంలో స్వేచ్ఛాయుత జలరవాణాపై క్వాడ్ నేతలు చర్చించనున్నారు.





