
ఢిల్లీలో భారీ సొరంగం బయటపడింది. ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఉందని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. స్వాతంత్ర్య సమరయోధులను తరలించేందుకు ఈ మార్గాన్ని తెల్లమూకలు వాడుకున్నట్టు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ తెలిపారు. 1993లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు దీని గురించి తెలిసిందని, ఎర్రకోటకు అసెంబ్లీ నుంచి సొరంగ మార్గం ఉన్నట్టు చెప్పేవారని ఆయన అన్నారు. సొరంగ మార్గాన్ని పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పీకర్ చెప్పారు. 2022 ఆగస్టు 15 లోపు 76 వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పునరుద్ధరణ పనులు పూర్తవుతాయన్నారు. 1912లో కోల్కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేవేసిన ఆంగ్లేయులు… అంతకముందు ఢిల్లీ అసెంబ్లీని సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీగా వినియోగించేవారు. తర్వాత 1926లో అసెంబ్లీ ప్రాంగణాన్ని కోర్టుగా వాడుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను కోర్టుకు తరలించేందుకు సొంరంగాన్ని మార్గాన్ని వినియోగించేవారని స్పీకర్ తెలిపారు.





