
578views
విశాఖపట్నం జిల్లా, వి.మాడుగుల మండలం, ఘాట్ రోడ్డు కూడలిలో వేంచేసియున్న చల్లని తల్లి… కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మోదకొం డమ్మ అమ్మవారి ఆలయంలో వెండి పాదాలు ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్డు కూడలిలో మోదమాంబ హోటల్ యజమాని, మాడుగుల గ్రామానికి చెందిన రాకుర్తి వీర్రాజు అమ్మవారి కి వెండి పాదాలను సమర్పించారు. వేలాది రూపాయల వ్యయం తో వీటిని తయారు చేయించి, ఆలయ కమిటీ పెద్దల సమక్షంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా కూడలిలో అమ్మవారి పాదాలను ఊరేగించి, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పాదాలు విరాళం అందించిన రాకుర్తి వీర్రాజు సత్య దంపతులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మజ్జి అప్పారావు, పుట్టా బలరాం, కమిటీ సభ్యులు, ప్రజలు, వర్తక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.





