News

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం అవుతున్న వందే భారత్ రైళ్లు…

466views

‘మేకిన్ ఇండియా’లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ‘వందే భారత్’ రైళ్లు మరిన్ని సౌకర్యాలతో ముందుకు రానున్నాయి. అత్యవసర ద్వారాలు, మెరుగైన సీటింగ్ వసతులు, అధునాతన కోచ్ పర్యవేక్షణ వ్యవస్థలు.. లాంటి హంగులతో ఈ రైళ్ల కొత్త కోచ్ లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వారణాసి-దిల్లీ, కాట్రా-దిల్లీ మార్గంలో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

కొత్త కోచ్ ల్లో ప్రయాణికుల రక్షణకు అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే ఉన్న రెండు అత్యవసర ద్వారాలకు మరో రెండు జత చేస్తున్నారు. పుష్ బ్యాక్ సీటింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు నాలుగు బల్బులను ప్రతీ కోచ్ లో అమరుస్తున్నారు. విపత్తు సమయంలో విద్యుత్ వ్యవస్థ విఫలమైనా ఈ అత్యవసర బల్బులు పనిచేస్తాయి. మార్చి 2022 కల్లా ఈ కోచ్ తయారీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.