
742views
టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఈ రోజు సాయంత్రం ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత్ తరుపున ఫ్లాగ్ బేరర్గా కాంస్య పతక విజేత బజరంగి పునియా వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్ కు ఈరోజు చివరి రోజు.. అయితే భారత్ అథ్లెట్ల పోటీలకు మాత్రం శనివారమే చివరి రోజు.. టోక్యో ఒలింపిక్స్ మొదటి రోజున మీరా బాయి చాను రజతం తో మెరిస్తే.. శనివారం రోజున నీరజ్ చోప్రా 125 ఏళ్ల భారత కలను సాకారం చేస్తూ.. అథ్లెట్లిక్ పోటీల్లో గోల్డ్ మెడల్ ను అందించాడు. ఇక రెజ్లర్ భజరంగ్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మొదటి సారే కాంస్యం అందుకుని భారత్ పతకాల సంఖ్యను 7 కు చేర్చి సరికొత్త రికార్డ్ ను నెలకొల్పాడు.





