
404views
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గత రెండు నెలల్లో 98 మంది ముష్కరులు ప్రాణాలు కోల్పోయినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 62 ఉగ్రవాద ఘటనలు జరగగా 129 మంది మరణించారు. అందులో 12 మంది పౌరులు, 19 మంది భద్రతా సిబ్బంది… 98 మంది ఉగ్రవాదులు మరణించారు. ఒక్క జులైలోనే 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ 62 ఉగ్రవాద ఘటనల్లో 32 మే 1న కొవిడ్ కర్ఫ్యూ తర్వాతే జరగటం గమనార్హం. గత ఏడాది మే నెలలో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్లో 48, జులైలో 20 మంది మృతి చెందారు.




