
313views
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. 7 కిలోల బంగారం, రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారును పోలీసులు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని బంగారం, నగదును గుర్తించి సీజ్ చేశారు.