News

భారత్ లో పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. గతం కంటే రెట్టింపు…

711views

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏప్రిల్‌- జూన్‌ 15) నికరంగా రూ.1,85,871 కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21 ఇదే సమయంలో నమోదైన రూ.92,762 కోట్లతో పోలిస్తే.. వసూళ్లు ఈసారి రెట్టింపుకావడం గమనార్హం. అయితే గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పరిణామాలు వల్ల అప్పుడు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తక్కువగా నమోదైన విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ 15 వరకు మొత్తం ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్‌ ఆదాయపు పన్ను వసూళ్లు రూ.74,356 కోట్లు కాగా.. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.92,762 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.30,731 కోట్లను రిఫండ్‌లుగా ఇచ్చామని సీబీడీటీ తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.