
610views
భారతదేశంలో రోజూ సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు.
చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతోంది. బ్లూమ్బెర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటివరకూ 178 దేశాలలో 219 మిలియన్ మోతాదుల టీకాలు ప్రజలకు ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతిరోజూ సుమారు 3.54 కోట్ల మందికి టీకాలు వేస్తున్నారు. చైనా రోజూ 189 మిలియన్ వ్యాక్సిన్ల పంపిణీతో అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం ఇప్పటివరకు తన ప్రజలకు 80 కోట్ల మోతాదులను అందచేసింది. ఈ విషయంలో భారత్ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది.





