
కేంద్రం నుంచి ఇప్పటికే ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ట్విట్టర్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకు తొలుత బ్లూ బ్యాడ్జ్ను తొలగించిన సామాజిక మాధ్యమ దిగ్గజం… కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. కానీ అప్పటికే ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిపోయింది.
ప్రముఖుల, ప్రజా ప్రయోజనాలు ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈ బ్లూ టిక్ను ఇస్తుంది ట్విట్టర్. అయితే వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకు దీనిని తొలగించింది. శనివారం ఉదయం నుంచి ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. విషయం వైరల్ అయిన కొద్ది గంటలకే వెంకయ్య నాయుడు ఖాతాకు తిరిగి బ్లూ బ్యాడ్జ్ను అతికించింది ట్విట్టర్.
సంబంధిత ఖాతాను ఉపయోగించి ఎక్కువ రోజులు గడిస్తే బ్లూ టిక్ తీసివేయొచ్చని ట్విట్టర్ నిబంధనల్లో ఉంది. చివరిగా 2020 జులై 23న వెంకయ్య నాయుడు ఈ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. అందుకే బ్లూట్ టిక్ను తొలగించామని ట్విట్టర్ ఆలస్యంగా వివరణ ఇచ్చింది.





