
భారత్ కరోనాపై పోరాడేందుకు అవసరమైన సాయుధ సంపత్తిని వివిధ దేశాల నుండి తెచ్చేందుకు గత నెల 30వ తేదీన నావికాదళం సముద్రసేతు-2ను ప్రారంభించింది. ఇప్పటికే భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ తల్వార్లు బహ్రెయిన్లోని మనామా పోర్టుకు చేరుకొన్నాయి. ఇక్కడి నుంచి 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ను ముంబయికి తరలించనున్నాయి. ఇప్పటికే ఐఎన్ఎస్ ఐరావత్ 8 ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు, దాదాపు 3150లకు పైగా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొని వైజాగ్ తీరానికి చేరింది. 10వేల ర్యాపిడ్ యాంటీజన్ కిట్లు, 450 పీపీఈ కిట్లు, ఏడు కాన్సన్ట్రేటర్లను సింగపూర్ నుంచి తరలించింది. ఇక ఐఎన్ఎస్ త్రిఖండ్ ఇప్పటికే ముంబయి తీరానికి చేరింది. దీనిలో 27 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కంటైనర్లు ఉన్నాయి. ఈ నౌక ఖతార్ నుంచి భారత్కు చేరింది. ఈ నెల 5వ తేదీన ఖతార్కు వెళ్లిన ఈ నౌక ఫ్రాన్స్ దౌత్యకార్యాలయం సమకూర్చిన ఆక్సిజన్ పరికరాలను తీసుకొచ్చినట్లు కో క్యాప్టెన్ హరీష్ బహుగుణ తెలిపిపారు.





