
527views
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఘటనలతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం ఎస్పీ సునీల్దత్ ఇప్పటికే ఘటనాస్థలానికి బయల్దేరి వెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





