News

మన సరిహద్దులు శత్రు దుర్భేద్యం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

507views

భారత్‌ సరిహద్దులు శత్రు దుర్భేద్యం.. అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. గల్వాన్‌ ఘటన నేపథ్యంలో లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణమంత్రి.. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ”గల్వాన్‌ ఘటనలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగించింది. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోంది. ప్రపంచానికి భారత్‌ శాంతి సందేశాన్ని ఇచ్చింది. భారత్‌ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయలేదు. పరిస్థితి విషమిస్తే దీటుగా జవాబిచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. భారత్‌లోని అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరు. ఎవరైనా దురాక్రమణకు దిగితే దీటైన సమాధానం ఉంటుంది. దేశ గౌరవం అన్నింటికంటే చాలా గొప్పది. దేశ గౌరవంపై దాడిచేస్తే ఏ మాత్రం ఉపేక్షించం. భారత్‌ ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయలేరు. సరిహద్దు వివాదం పరిష్కారంపై చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఎంతమేరకు పరిష్కారం చూపిస్తాయో ఇప్పుడే చెప్పలేం” అని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.