News

ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు GVRR జూనియర్ కళాశాల విజయ దుందుభి

1.4kviews

మార్చి 2020 ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు నగరంలోని GVRR కళాశాల విజయ దుందుభి మ్రోగించింది. గత సంవత్సరంలో లాగానే ఈ ఏడాది కూడా ఇంటర్మీడియట్ Bi.P.C గ్రూపులో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలలో ప్రథమ స్థానం సాధించింది. GVRR కళాశాలలో ఇంటర్మీడియట్ Bi.P.C విద్యార్థిని నర్సింగు హరిత 440 మార్కులకు గాను 413 మార్కులు సాధించి ప్రధమ స్థానంలో నిలిచింది.

జి వి ఆర్ ఆర్ కళాశాలలో జిల్లాలోని నలుమూలల నుండి పేద విద్యార్థులను చేర్చుకుని వారికి విద్యతో పాటు నైతిక విలువలు నేర్పి చదువుకు పేదరికం అడ్డంకి కాదు అని కళాశాల యాజమాన్యం చాటుతోంది. అంతేకాకుండా కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తోంది.

హర్షిత తోపాటుగా C.E.Cలో 500 మార్కులకు గాను 432 మార్కులు సాధించిన విద్యార్థి అలారి శివ కుమార్, M.P.C లో 470 మార్కులకుగాను 371 మార్కులు సాధించిన బుచ్చంగారి కార్తీక్ లను కళాశాల కరస్పాండెంట్ శ్రీ పలనాటి రామ దండు, ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నారాయణ, సివిక్స్ లెక్చరర్ శ్రీ దోర్నాదుల వెంకటేశ్వర్లు గార్లు అభినందించారు. రాబోయే విద్యా సంవత్సరానికి ఇంగ్లీషు, తెలుగు మీడియం M.P.C, Bi.P.C, CEC గ్రూపుల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.