హిందూ సమాజ సంఘటనే సంఘ లక్ష్యం : మోహన్ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ళ సుదీర్ఘ ప్రయాణం, సంస్థ దృష్టికోణం, దేశనిర్మాణం పట్ల గల నిబద్ధత తదితర అంశాలను స్పృశిస్తూ మేధావులు, విద్యావేత్తలు, సమాజ ప్రముఖులను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. "100 ఏళ్ళ సంఘ్ యాత్ర: కొత్త ఆశయాలు" (100 Years of Sangh Journey: New Horisons) అంశంపై వ్యాఖ్యానమాల పేరిట బెంగళూరులో 2 రోజుల ఉపన్యాస శ్రేణిని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.తొలి రోజున రెండు భాగాలుగా జరిగిన ఉపన్యాసంలోని మొదటి అంకంలో సంఘ్ వ్యవస్థాపక ఆదర్శాలు, వ్యవస్థాపకులైన డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవితము, లక్ష్యాలను, హిందూ విలక్షణత నిర్వచనం, నాగరిక సంబంధంగా భారతీయ ఐక్యత తదితర అంశాలను ప్రస్తావించారు. సంఘ్ నిజతత్వం, ధ్యేయాలను తెలియజేస్తూ డాక్టర్ మోహన్ భాగవత్...






