నారద జయంతితో జాతీయవాదుల ఐక్యత: ఐవైఆర్
తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుందని, ఇపుడు నేషనల్ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు అన్నారు. గతంలో జర్నలిజంలో అంతా మేనేజ్మెంట్ యుగమే నడిచిందని, ఇప్పుడు పాత్రికేయులే కాకుండా సామాన్య పౌరులు కూడా సోషల్ మీడియాలో ద్వారా యాక్టివ్గా అయిపోతున్నారని, ఇదో కొత్త పంథా అని తెలిపారు. నారద జయంతి నేపథ్యంలో సమాచార భారతి సంస్థ శుక్రవారం హైదరాబాదులో పాత్రికేయులకు అందించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం పోకడే మారిపోయిందన్నారు. ఇందులో మంచి, చెడూ రెండూ వున్నాయని, అయితే ఫేక్ న్యూస్ బాగా ప్రచారం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు కమ్యూనిస్టులు చాలా పద్ధతి ప్రకారం దుష్ప్రచారం...





