News

ఢాకాలో మహిళా జర్నలిస్టుకు వేధింపులు

315views

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయి. భారత దేశానికి,హిందువులకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇటీవలే అక్కడ హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్‌ కృష్ణదాస్‌ను దేశద్రోహం నేరం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా బంగ్లాదేశ్‌లో మున్నీ షా అనే మహిళా జర్నలిస్టును రాజధాని ఢాకాలోని కార్వాన్‌బజార్‌లో అల్లరిమూకలు చుట్టుముట్టాయి.చుట్టుముట్టడమే కాకుండా ఆమెను కొంత సేపు వేధించారు. అయితే పోలీసులు ఆ మహిళా జర్నలిస్టును అల్లరి మూక భారీ నుంచి కాపాడారు.

భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌హసీనాను సమర్థించినందుకే షాను వేధించినట్లు తెలుస్తోంది. ను అల్లరి మూక నుంచి కాపాడారు.భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌హసీనాను సమర్థించినందుకే షాను వేధించినట్లు తెలుస్తోంది.