
265views
ధర్మరక్షణలో భాగంగా హిందూ దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కలిగించాలనే సంకల్పంతో జనవరి 5న విజయవాడలో నిర్వహించే ‘హైందవ శంఖారావం’ బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ మండల సభ్యులు చెన్నకేశవులు, హేమంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని దేవనకొండ, పెద్దవరం గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సనాతన ధర్మం మన జీవన విధా నంలో భాగమని తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని దేవాలయాల పరిరక్షణకు తమవంతు కృషి చేయాలని తెలిపారు.





