తిరుమల–తిరుపతి దేవస్థానాల అనుబంధ సంస్థ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 8న వైయస్సార్ జిల్లా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ గోపిబాబు తెలిపారు.ఆ సంస్థ కార్యాలయంలో ఆయన వైయస్సార్ జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు కె.విజయభట్టర్, ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి రామ మహేష్, సభ్యులు దామోదరమ్మ, డి.వెంకటరెడ్డి, చింతకుంట శివారెడ్డి, మునికుమార్లతో కలిసి ఈ వివరాలను తెలిపారు. పోటీల్లో భాగంగా సంపూర్ణ భగవద్గీత శ్లోకాలను విద్యార్థులు చెప్పాల్సి ఉంటుందన్నారు. 6, 7 తరగతుల విద్యార్థులను మొదటి విభాగంగా, 8, 9 తరగతుల విద్యార్థులను రె ండవ విభాగంగా, ధ్యాన యోగంపై శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లలోపు వయసు గల విద్యార్థులను సీనియర్స్ విభాగంగా గుర్తించి.. సంపూర్ణ భగవద్గీతపై పోటీ నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఈ పోటీలను హౌసింగ్బోర్డు కాలనీ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తామని ఆయన వివరించారు.
309views