తిరుమల–తిరుపతి దేవస్థానాల అనుబంధ సంస్థ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 8న వైయస్సార్ జిల్లా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ గోపిబాబు తెలిపారు.ఆ సంస్థ కార్యాలయంలో ఆయన వైయస్సార్ జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు కె.విజయభట్టర్, ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి రామ మహేష్, సభ్యులు దామోదరమ్మ, డి.వెంకటరెడ్డి, చింతకుంట శివారెడ్డి, మునికుమార్లతో కలిసి ఈ వివరాలను తెలిపారు. పోటీల్లో భాగంగా సంపూర్ణ భగవద్గీత శ్లోకాలను విద్యార్థులు చెప్పాల్సి ఉంటుందన్నారు. 6, 7 తరగతుల విద్యార్థులను మొదటి విభాగంగా, 8, 9 తరగతుల విద్యార్థులను రె ండవ విభాగంగా, ధ్యాన యోగంపై శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లలోపు వయసు గల విద్యార్థులను సీనియర్స్ విభాగంగా గుర్తించి.. సంపూర్ణ భగవద్గీతపై పోటీ నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఈ పోటీలను హౌసింగ్బోర్డు కాలనీ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తామని ఆయన వివరించారు.
274views
You Might Also Like
అస్సాం వరదల బాధితులకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం
22
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు.
29
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం
రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం:...
గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో
38
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’
36
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర
40
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...




