26
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విజయనగరంలో అక్టోబర్ 1, 2 తేదీలలో జనజాతి విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎ. ఆనంద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను స్థానిక కలెక్టరేట్లో డీఆర్ఓ ఎస్డీ అనిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతీయ సంస్కృతికి మూలధారమైన జనజాతి సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి జనజాతి బిడ్డపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ బొబ్బది సాయికుమార్, విభాగ్ సంఘటన కార్యదర్శి పెంచలయ్య, గిరిజన విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్ గెమ్మెలి కల్యాణ్, పార్వతీపురం జిల్లా కన్వీనర్ అల్లంగి మహేష్, నాని, తదితరులు పాల్గొన్నారు.