శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు. కళింగ రాజ్యాన్ని 63 ఏళ్లు నిరాటంకంగా పరిపాలించిన తూర్పుగంగ చక్రవర్తి చోడ గంగదేవుని కాలానికి సంబంధించిన కొత్త తెలుగు శిలాశాసనంగా గుర్తించారు. ఇప్పిలిలో ఉన్న కరంజీశ్వర స్వామి ఆలయంలో అఖండ దీపం వెలిగించడానికి కావాల్సిన నెయ్యి కోసం స్థానిక రేవినాయకుడు, 9 మాడల నగదును (అప్పుడు చెలామణిలో ఉన్న నాణేలు) దానం చేసిన సందర్భంగా క్రీస్తు శకం, 1137 ఆగస్టు 17న బుధవారం ఈ శాసనం వేసినట్లు కేంద్ర పురావస్తుశాఖ శాసనవిభాగ సంచాలకుడు కె.మునిరత్నం రెడ్డి తెలిపారు. ఇప్పిలి చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామమని, ఆ గ్రామంలో కరంజీశ్వర (శివునికి అంకితమైన) ఒక దేవాలయం ఉండేదని పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఆ దేవాలయం రూపురేఖలు మారి ఆధునీకరించబడిందని, అప్పటి శిల్పాలు ఇప్పటికీ అలనాటి చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిని కాపాడుకుని భవిష్యత్తరాలకు అందించాలని గ్రామస్థులకు, జిల్లా యంత్రాంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
28
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
22
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
18
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
25
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
12
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
19
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
22
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...