35
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి ‘జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’ గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయం పేరు మార్పుతో సహా సోమవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
పుణె విమానాశ్రయం పేరును జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ పుణె అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తూ చేసిన ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.