News

ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్

25views

తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్‌లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రశ్నించారు. ఆ నెయ్యిలో ఏం కలుస్తుందో ఎవరైనా తనిఖీ చేశారా? అంటూ నిలదీశారు.
లడ్డూకే పరిమితం చేయకుండా మిగతా అన్ని పదార్థాలను తనిఖీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. 1857లో సిపాయిల తిరుగుబాటు ఎలా జరిగిందో చరిత్ర పుస్తకాల్లో చదివామని చెబుతూ లడ్డూ కారణంగా హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో ఇప్పుడు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందులో ప్రమేయం ఉన్నవారిని శిక్షించాలని, ఆస్తులను జప్తు చేసి.. వారందరినీ జైల్లో పెట్టాలని పండిట్ రవిశంకర్ స్పష్టం చేశారు.

ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ శాకాహారం అని పిలిచే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన సూచించారు. ఆలయ నిర్వహణ సాధువులు, ఆధ్మాత్యికవేత్తల పర్యవేక్షణలో ఉందా? లేదా? అనేది చూడాలని ఈ సందర్భంగా ఆలయాలలో రాజకీయ జోక్యంపై పరోక్షంగా ప్రస్తావించగారు. కమిటీలో ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని చెబుతూ అయితే ప్రధాన నిర్ణయాలు, ప్రతిదీ ఎస్‌జీపీసీ వంటి మతపరమైన బోర్డులు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.