శివపదాలను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, విశాఖ రుషిపీఠం సత్సంగ సభ సంయుక్త ఆధ్వర్యంలో ‘శివ పదం సంకీర్తన యజ్ఞం’ కార్యక్రమం జరిగింది. ముందుగా అకాడమీ అధ్యక్షుడు ఎం.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శి డా.రాంబాబు, ప్రధాన నిర్వాహకులు కందాళి వెంకట సత్యశ్యామ్, అరుణ గాయత్రి, వి.వి.ఆదినారాయణ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు కొనసాగాయి. ఆధునిక సమాజాన్ని, యువతను సన్మార్గం వైపు నడిపించడం ఆధ్యాత్మికతతోనే సాధ్యమన్నారు. శివపదం ప్రతి నోటా జపించేలా చేయడమే దానికి సరైన మార్గమన్నారు. పరమ శివుడిని ధ్యానించే వారికి సులభతరంగా ఉండేలా కొన్ని పద్యాలను రచించామన్నారు. శివపదం స్తుతించడం ద్వారా మానసిక వికాసం లభిస్తుందన్నారు. శబ్ద, బ్రహ్మ స్వరూపమైన శివ నామస్మరణ ఆవశ్యకతను యువతకు దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం నల్లాన్ చక్రవర్తుల కౌశిక్ కల్యాణ్ తమ బృందగానంతో సభికులను అలరించారు. వేజేటి శ్రీరామాచార్యులు, దోర్భల ప్రభాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.
38
You Might Also Like
సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరం
7
సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరమని టీటీడీ మాజీ మెంబరు సీతారామిరెడ్డి అన్నారు. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామికి నాట్యనీరాజనాలు ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన ఆర్కే కళా సంస్కృతి ఫౌండేషన్...
అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం
(సెప్టెంబర్ 23 - అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం ) అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. వినికిడి...
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
50
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్...
కేదార్నాథ్ నడక దారిలో కుంగిన భూమి
47
కేదార్నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు....
రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.
55
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్…...
ఆర్టికల్ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు: ఫరూక్ అబ్దుల్లాపై అమిత్ షా విమర్శలు
34
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సహా ఇతర పార్టీలు...