News

పశువుల అక్రమ రవాణా అడ్డగింత

29views

విజయనగరం జిల్లాలోని పాచిపెంటలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు వాహనాలను పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ వెంకటసురేష్‌ తన సిబ్బందితో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, అటుగా వస్తున్న పశువుల వాహనాలను నిలుపుదల చేశారు. ఒడిశా నుంచి మానాపురం గ్రామానికి పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని, వాహన చోదకులపై కేసు నమోదు చేశారు.