News

శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త, స్పర్శ దర్శనంపై కీలక నిర్ణయం

42views

భక్తులకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం అలంకార దర్శనాలు మాత్రమే కల్పించాలని గతంలో నిర్ణయించినప్పటికీ మార్పు చేసినట్లు వివరించారు.

భక్తుల నుంచి వస్తున్న వినతుల మేరకు ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనాలు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నిర్దిష్ట సమయాల్లో నాలుగు విడతలుగా దర్శనం కల్పిస్తామన్నారు. మొదటి విడతలో ఉదయం 6.45 నుంచి 8.30 వరకు, రెండో విడతలో మధ్యాహ్నం 12.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మూడో విడతలో భాగంగా రాత్రి 8 నుంచి 9 వరకు, చివరగా రాత్రి 10 గంటల నుంచి 11.30 గంటల వరకు స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
స్పర్శ దర్శనం టికెట్లను కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ల లభ్యతను బట్టి గంట ముందుగా టికెట్లను జారీ చేయనున్నారు. దేవస్థానానికి చెందిన వెబ్‌సైట్‌ srisailadevasthanam.org లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.