శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణమాసోత్సవాల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా, భీమడోలుకు చెందిన బులుసు అపర్ణచే ఈ నెల 14వ తేదీ ప్రారంభించిన ద్విశతావధానం కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఆలయ మాఢవీధిలోని నిత్యకళారాధన వేదికపై ‘‘అవధాన కవితా నీరాజనం’’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు నిర్వహించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధులైన 60 మంది కవిపండితులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. ముగింపు సమావేశానికి విశిష్ఠ అతిథిగా ఆచార్య జి.ఎస్. కృష్ణమూర్తి, వైస్ చాన్సలర్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి వారు విచ్చేశారు. కార్యక్రమం ముగింపులో అవధాని, విశిష్ఠ అతిధులు, పృచ్చకులు, వ్యవహరించిన కవిపండితులందరికీ వేదాశీర్వచనంతో స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకురాలు గిరిజామణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
55
You Might Also Like
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
2
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
10
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
14
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
18
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...
28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు
28
అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా...
ఇప్పిలిలో పురాతన శిలాశాసనం
25
శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు....