News

భూలోకమాత విగ్రహం ధ్వంసం

60views

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం లొద్దపుట్టి గ్రామంలో భూలోక మాత విగ్రహాన్ని గుర్తుతెలి యని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన రోకళ్ల జానకి పూజ కోసం ఆలయం వద్దకు వెళ్లారు. ధ్వంసమైన విగ్రహాన్ని చూసి గ్రామస్థులకు తెలియజేశారు. దీంతో గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలిం చారు. ఎన్నో దశాబ్దాలుగా కొలుస్తున్న భూలోక మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని గ్రామస్థు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి కాళ్ల భాగా న్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇలాంటివి పునరా వృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.