జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్లోకి ఎగదోస్తోందని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా తెలిపారు. జమ్మూకశ్మీర్లో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఉగ్ర ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశపు దుర్మార్గపు కుట్రలను విఫలం చేసేందుకు భద్రతా బలగాలు, పాలనా యంత్రాంగం ఒక వ్యూహాన్ని రూపొందించాయన్నారు. వచ్చే మూడు నెలల్లో స్థానిక పరిస్థితిలో పెను మార్పు కనిపిస్తుందని ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘‘ఇటీవలి ఉగ్ర ఘటనలు బాధాకరం. వాటిని కచ్చితంగా నియంత్రిస్తాం. పొరుగు దేశం దుష్ట పన్నాగాలు విఫలమవుతాయి. ఆ దేశం ఉగ్రవాదానికి నిలయం. ఇక్కడి శాంతిభద్రతలను అస్థిరపర్చేందుకు వారిని ప్రోత్సహిస్తోంది. ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ పెద్దఎత్తున బలగాలను రంగంలోకి దించుతోంది. సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బంది మోహరింపును ముమ్మరం చేశాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యూహాన్ని సమీక్షించారు. రాబోయే రోజుల్లో సత్ఫలితాలు కనిపిస్తాయి’’ అని మనోజ్ సిన్హా తెలిపారు.
70
You Might Also Like
పాక్లో పర్యటన మాత్రమే.. ఆ దేశంతో చర్చల్లేవు: జై శంకర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశానికి ఆయన...
గంటల వ్యవధిలో ఊచకోత
ఆఫ్రికాలోని బుర్కినా ఫోసో దేశంలో జరిగిన అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు బర్సాలోగో పట్టణంలో ఆగష్టు 24న విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 600...
తాలిబన్లను ఉగ్రజాబితా నుంచి తొలగించిన రష్యా
6
ఉగ్రసంస్థ తాలిబన్ల పాలనను రష్యా గుర్తించింది. ఉగ్రవాదుల జాబితా నుంచి తాలిబాన్లను తొలగిస్తున్నట్లు రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలను...
బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతపై అమెరికాలో ఎయిర్లైన్ బ్యానర్
అమెరికాలోని హిందూ సంస్థలు భారీ ఎయిర్లైన్ బ్యానర్తో ప్రపంచానికి తమ విజ్ఞప్తిని బలంగా వినిపించారు. బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతను ఆపడానికి ప్రపంచదేశాలు అత్యవసరంగా స్పందించాలని వారు డిమాండ్...
వారధి ఫిర్యాదులో లవ్ జిహాద్ కేసు
16
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నించడానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ‘వారధి’ కార్యక్రమంలో లవ్జిహాద్ కేసు వెలుగుచూసింది. శుక్రవారం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ...
త్రిపురాంతకేశ్వర ఆలయంలో బయటపడిన.. 14వ శతాబ్దం నాటి శాసనం
51
ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి మరో శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని నంది పక్కనే ఉన్న ఓ...