చెన్నై మెట్రోరైల్ విభాగానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మెట్రోరైలు రెండోదశ నిర్మాణ పనుల కోసం థౌజండ్ లైట్స్ ప్రాంతంలోని రాయపేట వైట్స్ సాలైలో వున్న పురాతన శ్రీ రత్న వినాయగర్, దుర్గయమ్మన్ ఆలయ గోపురాలు కూల్చేసేందుకు మెట్రో అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిని వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మెట్రోరైలు పనుల కోసం పురాతనమైన ఆలయ రాజగోపురాన్ని 5 మీటర్లు లోపలికి తరలించి, పనులు పూర్తైన తర్వాత అదే ప్రాంతంలో ఏర్పాటు చేసి, కుంభాభిషేకం కూడా నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో పనుల వల్ల రాజగోపురం కచ్చితంగా ప్రభావితం అవుతుందని, ఆధునిక సాంకేతికతతో 5 మీటర్లు లోపలికి తరలించి, పనులు పూర్తైన తర్వాత మళ్లీ అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. రత్న వినాయగర్ ఆలయాన్ని కూల్చేసే పరిస్థితే వస్తే.. పనులు పూర్తయ్యాక అక్కడే గుడి ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత కుంభాభిషేకం కూడా నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది.
మెట్రో రైలు విస్తరణలో భాగంగా పురాతన ఆలయ గోపురాలను కూల్చేయాలంటూ మెట్రో అధికారులు చర్యలు చేపట్టడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఇంచార్జి చీఫ్ జస్టిస్ కృష్ణకుమార్, జస్టిస్ కుమరేశ్ బాబు ధర్మాసనంలో పెండింగ్ లో వుంది. అనంతరం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆలయాలకు, గోపురాలకు ఎలాంటి నష్టం జరగకుండా మెట్రో పనులు పూర్తి చేయవచ్చా? లేదా? అన్న విషయంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుమరేశ్ బాబు నేరుగా వెళ్లి, పరిశీలించి, నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ తాజాగా మళ్లీ విచారణకు వచ్చింది.
57
You Might Also Like
ఐదో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ
51
శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. ఇప్పటికే వరుసగా నాలుగు రోజులు దుర్గమ్మ.. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఐదో రోజు.. అంటే సోమవారం (07-10-2024) మహాచండి అలంకారంలో అమ్మలగన్నయమ్మ...
ఎరువుగా మారనున్న ఏడాది కిందటి ‘అరవణ ప్రసాదం’
20
శబరిమల అనగానే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం. అయ్యప్ప స్వామి ఫొటోతో కూడిన చిన్నపాటి టిన్ కంటైనర్లో ఉండే ఈ ప్రసాదాన్ని శబరిమలలో అయ్యప్ప భక్తులకు పంపిణీ చేస్తుంటారు....
తమిళనాడు గడ్డ సిద్ధులకు, సాధు పుంగవులకు నెలవు: పవన్ కల్యాణ్
43
ఇటీవల సనాతన ధర్మం అంశంలో తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ తో మాటల యుద్ధం రాజుకున్న నేపథ్యంలో... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడుపై ప్రత్యేకంగా...
మరో అస్త్రానికి సానబెడుతున్న భారత్
37
గతంతో పోల్చితే ఇప్పుడు యుద్ధం జరిగే తీరుతెన్నుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. అందుకు ఇజ్రాయెల్ గట్టి ఉదాహరణ. ఐరన్ డోమ్ టెక్నాలజీ సాయంతో శత్రు క్షిపణులను, రాకెట్లను...
టార్గెట్ 2026: మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా హైలెవెల్ మీటింగ్..
39
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సోమవారం ( అక్టోబర్ 7, 2024 ) మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
తిరుమల మెట్ల మార్గంలో మృతదేహం
39
తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే మార్గంలోని నరసింహ స్వామి వారి ఆలయం సమీపంలో ఓ మృతదేహం పడిఉండటం స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజులుగా దుర్వాసన...