స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పరారీలో ఉన్న ఓ ఐసిస్ ఉగ్రవాది ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దిల్లీలోని దరియాగంజ్కు చెందిన రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీ ఐసిస్ పుణె మాడ్యూల్లో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. అతడిపై ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ రూ.3 లక్షల రివార్డ్ ప్రకటించింది. గురువారం రాత్రి 11 గంటలకు తుగ్లకాబాద్లోని బయోడైవర్సిటీ పార్క్ వద్దకు రిజ్వాన్ అలీ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ప్రత్యేక విభాగం పోలీసులు అత్యంత చాకచక్యంగా అతడిని వలపన్ని పట్టుకున్నారు. అలీ నుంచి పిస్టోల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి.. వాటిలోని డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఢిల్లీలోని పలు వీఐపీ ప్రాంతాల్లో రిజ్వాన్, అతడి అనుచరులు ఇప్పటికే పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పంద్రాగస్టు వేళ ఉగ్రదాడులకు వీరు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
55
You Might Also Like
కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య
36
అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...
మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి
34
మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది....
దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా
50
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని...
భక్తులలో భగవంతుని దర్శిస్తూ సేవలందించండి – అదనపు ఈవో
28
టీటీడీ ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల...
రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు
24
రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా...
హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి
40
తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని...