మథురలోని షాహీ ఈద్గా మసీదు ప్రాంగణం, పక్కనే ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంపై కోర్టు పర్యవేక్షణలో సర్వే జరగాలన్న అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుపై విధించిన స్టేని సుప్రీంకోర్టు.. నవంబరు వరకూ పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. మసీదు కాంప్లెక్స్పై సర్వే కోసం గత ఏడాది డిసెంబరు 14న హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీన్ని పర్యవేక్షించడానికి ఒక కోర్టు కమిషనర్ను నియమిస్తామని తెలిపింది. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 16న స్టే విధించింది. తాజాగా దాన్ని పొడిగించింది. అంతకుముందు సర్వోన్నత న్యాయస్థానంలో హిందువుల తరఫున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపిస్తూ.. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంపై దాఖలైన 18 కేసుల విచారణయోగ్యతను సవాల్ చేస్తూ ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 1న హైకోర్టు కొట్టేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరు 14 నాటి ఉత్తర్వులు, సంబంధిత ఇతర ఆదేశాలకు వ్యతిరేకంగా షాహీ మసీదు దాఖలు చేసిన అపీళ్లు నిష్ప్రయోజనంగా మారాయని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. జనవరి 16న విధించిన స్టేను ఎత్తివేయాలన్న వినతి కూడా దాఖలైందని పేర్కొంది. అన్ని అంశాలపై నవంబరులో విచారణ జరుపుతామని తెలిపింది.
35
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
42
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
45
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
53
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
36
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...