News

త్రివర్ణ పతాకాన్ని దగ్ధం చేస్తాం…. ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూన్‌ అనుచిత వ్యాఖ్యలు

36views

ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ మరోసారి రెచ్చిపోయారు. వాషింగ్టన్‌ డీసీ నుంచి మెల్‌బోర్న్‌ వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని దహనం చేయబోతున్నామని హెచ్చరించారు. భారత్‌లో పంజాబ్‌ భాగం కానందున, ఆగస్టు 15న సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ త్రివర్ణ పతాకం ఎగురవేయకూడదని పేర్కొన్నారు. జలంధర్‌లో జాతీయ జెండా ఎగురవేయకుండా మాన్‌ను అడ్డుకున్నవారికి తమ సంస్థ తరఫున రూ.కోటి ఇస్తామని ప్రకటించారు.