News

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ హిందూ జాగరణ్ మంచ్ నిరసన

27views

బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, అక్కడి రాజకీయ అశాంతిని నిరసిస్తూ బంగ్లాదేశ్ లోని హైకమిషన్ ముందు హిందూ జాగరణ్ మంచ్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచిన తర్వాత అక్కడి మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై ఇస్లామిక్ మూకలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఆరెస్సెస్ అనుబంధ విభాగం హిందూ జాగరణ్ మంచ్ మండిపడుతోంది. మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులను వెంటనే నిలిపేయాలని పిలుపునిచ్చారు.

బంగ్లాదేశ్ లో నిరసనల నెపం పెట్టి… హిందువులను వెతికి వెతికి మరీ దారుణంగా హత్యలు చేస్తున్నారు ముస్లిం నిరసనకారులు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. చాలా మంది హిందువులను ముస్లిం ఛాందసులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి, భారత్ కి చేరుకున్న తర్వాత హిందువులపై ఇస్లామిక్ ఛాందసవాదులు రెచ్చిపోయి, అడ్డూ అదుపు లేకుండా దాడులకు దిగుతున్నారు. ఇస్లామిక్ మూకలు హిందువుల ఇళ్లపై దాడి చేసి, తగలబెడుతున్నారు. దీంతో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హిందువులు పరుగెత్తి, దాక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. హిందువులను కాపాడడానికి అక్కడ ఎలాంటి వ్యవస్థలూ లేకపోవడం అత్యంత శోచనీయం. మరోవైపు బంగ్లాదేశ్ లోని నారాయణ గంజ్ లోని ఓ హిందువుల నివాసంపై 400 మంది ఇస్లామిక్ ఛాందసుల దాడి చేసి, ఇంటిని దోచుకున్నారు.