ArticlesNews

ఈ గుడి ఏడాదికి ఒక్కరోజే తెరుస్తారు..

54views

హిందూ ధర్మంలో సర్పాలను దేవుళ్లుగా ఆరాధిస్తారు. దేవతలు కూడా సర్పాలను ఆభరణాలుగా ఉంటాయి. అయితే దేశంలో ఎన్నో నాగదేవాలయాలున్నాయి. అందులో ప్రమఖమైనది, ఇతర దేవాలయాలకన్నా ప్రత్యేకమైనది ఉజ్జయినిలో నాగ‌చంద్రేశ్వరాల‌యం. ఉజ్జయినిలోని మ‌హాకాల్ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వరాల‌యం ఉంది. ఇది ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున ( ఆగస్టు 9) నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. నాగ పంచమి రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నాగ పంచమి పండుగను జరుపుకుంటున్నారు. పవిత్రమైన పండగ సందర్భంగా సంవత్సరం పొడవునా మూసి ఉండి.. ఒక్క నాగ పంచమి రోజున

మాత్రమే 24 గంటల పాటు తెరిచే ప్రత్యేకమైన ఆలయం ఉంది..
ఏ ఆలయంలో అయినా ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి. కొన్ని ఆలయాలు కొన్ని నెలల పాటూ ఓపెన్ చేసి మళ్లీ మూసివేస్తారు. అయితే ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఆగష్టు 08 నాగులచవితి, ఆగష్టు 09 గరుడ పంచమి… కొన్ని ప్రాంతాల్లో కార్తీకశుద్ధ చవితి రోజు పుట్టలో పాలు పోస్తే..మరికొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చవితి రోజు పాములను పూజిస్తారు. అయితే పుట్ట దగ్గర పూజల సంగతి సరే కానీ.. ఓ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాలంటే కేవలం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే సాధ్యం అవుతుంది..అదికూడా శ్రావణ శుద్ధ పంచమి రోజు మాత్రమే.

ఈ ఏడాది (2024) ఈ నాగచంద్రేశ్వరాలయం ఆగస్టు 8వ తేదీ రాత్రి 12 గంటలకు తలుపులు తెరుచుకోగా, ఆగస్టు 9వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఆలయ తలుపులు తెరిచి ఉంటాయి. దీని తరువాత నాగచంద్రేశ్వరాలయం మళ్లీ ఒక సంవత్సరం పాటు మూసివేయబడుతుంది. నాగచంద్రేశ్వరుని దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం మాత్రమే ఉంది.

మన దేశంలో నాగపూజ జరిగే ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనది నాగచంద్రేశ్వర దేవాలయం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అత్యంత పురాతననగరం అయిన ఉజ్జయినిలో ఈ ఆలయం ఉంది. సాధారణంగా ఉజ్జయినీ అనగానే మహాకాళేశ్వర లింగం గుర్తుకు వస్తుంది. భారత దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి మహాకాళేశ్వర లింగం. ఈ దేవాలయం మూడో అంతస్తులోనే నాగ చంద్రేశ్వర దేవాలయం ఉంది. ఇక్కడ కేవలం నాగపంచమి రోజున మాత్రమే స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే పంచమి రోజు ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేకపూజలు చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు సర్పరాజు… తక్షకుడు ఇక్కడ కొలువై ఉంటారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

ఇక ఉజ్జయిని నాగ‌చంద్రేశ్వర స్వామి ఆల‌యానికి శతాబ్దాల చ‌రిత్ర ఉంది..1050లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడని ఆ త‌ర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మ‌హ‌రాజ్ 1732 లో ఆల‌య జీర్ణోద్ధర‌ణ చేప‌ట్టాడని చెబుతారు. ఈ ఆల‌యాన్ని ఒక్కసారి ద‌ర్శించుకుంటే చాలు తరతరాలుగా వెంటాడుతున్న స‌ర్పదోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ంటారు. అందుకే నాగ‌పంచ‌మి రోజు ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతారు. ఈ ఒక్కరోజే దాదాపు మూడు ల‌క్షల మంది భ‌క్తులు నాగచంద్రేశ్వర స్వామిని ద‌ర్శించుకోవ‌డం విశేషం….