నదితీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పారబోయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పర్యావరణంతోపాటు జలచరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్ రిషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, శాశ్వత ఆక్రమణలపై వేసిన పిటిషన్ను 2020 జూన్ 30న ఎన్జీటీ కొట్టివేయడంపై పట్నాకు చెందిన అశోక్ కుమార్ సిన్హా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను విన్న సర్వోన్నత న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. ‘‘నదీతీరాల్లో ప్లాస్టిక్ను పారవేయడం పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తోంది. జలచరాలపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపుతోంది. ప్రజల సహకారంతో బాధ్యతగల అధికారులు సమష్టి కృషి చేయకపోతే.. చట్టవిరుద్ధమైన నిర్మాణాలను తొలగించడం, గంగ, దేశంలోని ఇతర నదుల్లో నీటి నాణ్యతను పెంచడం వంటి లక్ష్యాలు భ్రమలుగానే మిగిలిపోతాయి’’ అని ధర్మాసనం పేర్కొంది. దీనిపై నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
37
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
22
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
18
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
25
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
11
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
19
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
22
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...