తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను పెంచామన్నారు టిటిడి కార్యనిర్వాహణాధికారి జె.శ్యామలారావు. తిరుమలలో పాత్రికేయులతో ఈవో మాట్లాడుతూ మరింత మేలు రకమైన నెయ్యిని వినియోగించడం వల్ల లడ్డూ నాణ్యత పెరిగిందన్నారు. ఆన్ లైన్ టిక్కెట్టు బుకింగ్ వ్యవస్థలో లోపాలను సరిచేసి దళారీ వ్యవస్థను అడ్డుకున్నామన్నారు. సామాన్య భక్తులకు నిరంతరం అన్నపానీయాలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తిరుమలలో మూడు చోట్ల అదనంగా అన్నప్రసాద కేంద్రాలను తీసుకొచ్చామని..నూతనంగా మొబైల్ టాయిలెట్స్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నిత్యం భక్తులు భుజించే తరిగొండ వెంగమాంబ భవనంలో అన్నప్రసాద నాణ్యతను పెంచామన్నారు. నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు ప్రైవేటు హోటళ్ళలో భోజనాలను భక్తులకు విక్రయిస్తే అలాంటి షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్లాటెడ్ సర్వదర్సనం టోకెన్ల జారీని వారానికి లక్షా 5వేల నుంచి లక్షా 47వేలకు పెంచినట్లు చెప్పారు. నకిలీ ధృవపత్రాలతో దర్సనాలను పొందేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దళారీ వ్యవస్థను తిరుమలలో పూర్తిగా అరికడతామన్నారు.
52
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
41
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
26
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
34
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
24
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
43
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...