50
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుధాబీలోని ఓ వీధికి భారతీయ మూలాలున్న వైద్యుడు జార్జ్ మాథ్యూ (84) పేరు పెట్టారు. దేశంలో ఆరోగ్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ‘యూఏఈ దార్శనికుల గౌరవార్థం.. స్మారక వీధులు’ ప్రాజెక్టులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ‘జార్జ్ మాథ్యూ స్ట్రీట్’ నామఫలకాన్ని ఏర్పాటు చేసింది. అల్ మఫ్రఖ్లోని షేక్ షక్బౌత్ మెడికల్ సిటీ సమీపంలోని రోడ్డు ఈ వీధి పరిధిలోకి వస్తుంది. కేరళకు చెందిన డాక్టర్ మాథ్యూ త్రివేండ్రం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు.