అయోధ్య రామాలయ అర్చకుల డ్రెస్ కోడులో కొత్త మార్పులు రానున్నాయి. ఇప్పటి నుంచి వారు కొత్త వేష ధారణలో కనిపిస్తారు. సంప్రదాయంగా ఇప్పుడు ధరిస్తున్న కుంకుమ కలర్ వస్త్రాల స్థానంలో ప్రకాశవంతమైన పసుపు రంగు తలపాగా, కుర్తా మరియు ధోతీలను ట్రస్ట్ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఇక నుంచి గర్భగుడిలోకి స్మార్ట్ ఫోన్లను కూడా అర్చకులు తీసుకెళ్లకూడదని నిషేధం విధించింది. అలాగే మరి కొన్ని అంశాల విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. అర్చకుల వేష ధారణలో ఏకరూపత (యూనిఫాం) సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే.. ఎంత మంది మధ్యలో వున్నా… ఎక్కడ వున్నా… అర్చకులను ఇట్టే పసిగట్టగలగడం వీలవుతుందని, అందుకే డ్రెస్ కోడ్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకునితో పాటు 20 మంది అర్చకులు, ట్రైనీ అర్చకులకు కూడా ఇది వర్తించనుంది. ఇప్పటి వరకు కొందరు కుంకుమ కలర్ వస్త్రాలు, మరి కొందరు పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారు. ఇప్పటి నుంచి కొత్త డ్రెస్ కోడ్లతో కనిపించనున్నారు.
394views
You Might Also Like
కనిష్కను కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే : 41 ఏళ్ల తర్వాత అంగీకరించిన కెనడా
27
ఖలిస్థానీ ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబిస్తూ.. వారికి పరోక్షంగా మద్దతిస్తూ, ఆశ్రయమిస్తూ వచ్చిన కెనడా తన వైఖరిని మార్చుకుంటోందా..? అవుననే సమాధానం వస్తోంది. ఎయిరిండియా కనిష్క విమాన...
తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం..
27
తిరుపతిలో జాతీయ శాసనాల మ్యూజియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియం కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు...
విజయనగరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం
35
విజయనగర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలక ఘట్టమైన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా...
దేవాలయ గోశాలలు గోసంరక్షణకు, సనాతన సంస్కృతికి ప్రతీకలు
38
దేవస్థానాల్లో గోశాలల నిర్వహణ కేవలం పశుసంరక్షణకే పరిమితం కాకుండా, సనాతన ధర్మం, గోసంరక్షణ, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (సిటా) డైరెక్టర్,...
అమర్నాథ్ యాత్రపై పటిష్ఠ నిఘా
23
జులై 3న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' అనే...
పంజాబ్ లో క్రైస్తవ సంతుష్టీకరణ.
31
పంజాబ్ లో క్రైస్తవ మిషనరీల ప్రభావం వేగంగా విస్తరిస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమృత్సర్ జిల్లాలోని...





