శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ హిందూపురం డిపో ఆధ్వర్యంలో అయోధ్య, కాశీ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడప నున్నారు. ఎనిమిది రోజుల యాత్రలో 14 పుణ్యక్షేత్రాలు, పుణ్య నదీ స్నానాలు ఉంటాయని డిపో మేనేజర్ శ్రీకాంత బుధవారం ప్రకటించారు. హిందూపురం నుంచి ఈ నెల 24, జూలై 12, ఆగస్టు 9తేదీల్లో మూడుసార్లు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. మొదట హైదరాబాద్ శంషాబాద్ వద్ద చిన్నజీయర్ స్వామీజీ నిర్మించిన రామానుజచార్యుల ఆలయం, యాదగిరిగుట్ట, నరసింహస్వామి దేవాలయం అక్కడ నుంచి నిజామాబాద్ బాసర సరస్వతీ దేవాలయం, అలహాబాద్ ప్రయాగ్ రాజ్గంగ, యమున, సరస్వతీ పుణ్యనదుల నదీ స్నానాలు, అయోధ్య శ్రీబాలరాముడి దర్శనం, సీతాదేవి ఇల్లు, జనకమహారాజ్కోట, అనంతరం కాశీలోని విశ్వనాథుని దర్శనం, విశాలాక్షమ్మ దర్శనం, గంగానదీ పుణ్యతీర్థస్నానం, కాలబైరవ దర్శనం, విశాఖ పట్నం రామకృష్ణ బీచ, కైలాసగిరి, సింహాచలం అప్పన్న దర్శనం, అన్నవరం, సత్యనారాయణస్వామి దర్శనం, ద్వారక తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం, అన్నమయ్య క్షేత్రం, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం, అమరావతి, అమరేశ్వరుని దర్శనం, కోటప్పకొండ శ్రీపరమేశ్వర లింగదర్శనం, శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామి దర్శనం, యాగంటి బసవన్న దర్శనం చేయించి హిందూపురంతో యాత్ర ముగుస్తుందన్నారు. 14 రోజుల యాత్రకు ధర కేవలం రూ. 8,500 ఉంటుందన్నారు. వంటవారిని ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందని ఆహార దినుసులు బస్సులో యాత్రికులు అందించాలన్నారు. విడిది సమయంలో యాత్రికులే ఖర్చులు భరించాలన్నారు. యాత్రకు వెళ్లదలచిన వారు రిజర్వు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9440834715, 7382863007, 73828 61308ను సంప్రదించాలన్నారు.
72
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
31
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
24
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
32
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
14
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
27
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
32
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...