ఎవరైతే కర్తవ్య పరాయణులవుతారో వారిదే ఈ ప్రపంచం. మేం ఏ పనీం చేయం. ఖాళీగా ఇలా కూర్చుంటాం. అనే వారికి ఇహలోకమూ వుండదు. పరలోకమూ వుండదు. కష్టపడి పని చేసేవారిదే ఈ ప్రపంచం. నిరంతర ప్రయత్న శీలురదే ఈ ప్రపంచం. తమ స్వార్థాన్ని సంపూర్తిగా త్యజించ, తమను తాము ఈశ్వరీయ కార్యంలో నిమగ్నం చేసుకునే వారిదే ఈ ప్రపంచం, ఇహలోకము, పరలోకము వారినే గౌరవిస్తాయి, ఆదరిస్తాయి. కాబట్టి మనం ఎలాంటి స్వార్థ భావన లేకుండా వ్యక్తిగత ఆకాంక్షలు, కోరికలను వదిలిపెట్టి మనలో వున్న పాశవిక లక్షణాలను పరిత్యజించి, కేవలం ఒకే ఒక మార్గదర్శక సిద్ధాంతాన్ని చేతబూని కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ పోవాలి. ‘‘ఇది మన పవిత్ర భూమి. ఈ భూమికి నేను సేవ చేయాలి. ఈ భూమి పుత్రులైన హిందూ జాఇకి చెందిన పవిత్ర సంతానానికి సేవచేయాలి. వారందరినీ ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠులుగా తీర్చిదిద్దడం నా పరమ కర్తవ్యం. ఇందుకోసం తగినట్లుగా నేను నా మన: ప్రవృత్తిని మార్చుకుంటాను. నా బుద్ధి, వివేకము, శారీరక సామర్థ్యం లాంటి ఆవశ్యక లక్షణాలను, గుణాలను సంపాదించుకుంటాను. వాటి ద్వారా నా ఈ కర్తవ్యాన్ని ఉత్తమ రీతిలో పూర్తి చేయగలుగుతాను. హిందూ సంఘటనకు నేను అనుకున్న స్వరూపాన్ని సంతరించి పెడతాను’’ అని నిరంతరం మననం చేసుకుంటూ వుండాలి.-గురూజీ
53
You Might Also Like
కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య
36
అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...
మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి
34
మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది....
దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా
50
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని...
భక్తులలో భగవంతుని దర్శిస్తూ సేవలందించండి – అదనపు ఈవో
28
టీటీడీ ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల...
రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు
24
రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా...
హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి
40
తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని...