News

ఘనంగా అప్పన్న నిత్య కల్యాణం

48views

సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో బుధవారం సింహాద్రినాథుడి నిత్య కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు జరిపారు. దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఒడిశా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.నరసింగ్‌ కుటుంబ సమేతంగా నిత్య కల్యాణోత్సవంలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు న్యాయమూర్తి దంపతులను వేదమంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.