వీర మరణం పొందిన 79వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ సైనికుడు ఎం.సుధాకర్రావుకు నూజివీడు పట్టణం నెహ్రూపేట సామాజిక భవనంలో సీఆర్పీఎఫ్ అధికారుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. 1995 జూన్ 02న మణిపూర్లో తిరుగుబాటుదారులతో జరిగిన ఎన్కౌంటర్లో సైనికుడు సుధాకర్రావు వీరమరణం పొందారు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట సీఆర్పీఎఫ్ కార్యాలయ ఉన్నతాధికారుల ఆదేశంతో నోడల్ అధికారి, ఏఎస్సై మల్లేష్ బృందం నూజివీడు వచ్చి అధికారుల సమక్షంలో సుధాకర్రావు సతీమణి జయమ్మకు, కుటుంబసభ్యులకు సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ సీఐ ఎంవీవీఎస్ మూర్తి మాట్లాడుతూ.. తాను మరణిస్తానని తెలిసి కూడా దేశ, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన వీర సైనికుడు సుధాకర్రావు అని కొనియడారు. వీర మరణం పొందిన సైనికుల జీవితాలు నేటితరం యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
348views
You Might Also Like
ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించిన VHP కేంద్రీయ ప్రబంధ సమితి బైఠక్
31
విశ్వ హిందూ పరిషత్ (VHP) కేంద్రీయ ప్రబంధ సమితి రెండు రోజుల సమావేశం జూలై 19-20, 2026 తేదీల్లో ఛతర్పూర్లోని తేరాపంథ్ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి...
జగన్నాథుడి ఆభరణాల లెక్కింపు పూర్తి!
28
ఒడిశా పవిత్ర పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆభరణాల భాండాగారం రత్నభాండార్ ప్రత్యేక లెక్కింపు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రఖ్యాత పూరి జగన్నాథ యాత్ర ముగిసి జగన్నాథ,...
విరాళాల చోరీని రాజకీయం చేయొద్దు : సుప్రీంకోర్టు
35
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయ...
ధర్మవరంలో జగన్నాథ రథయాత్ర
34
ధర్మవరం ఇస్కాన్ (ISKCON) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది. ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ...
పౌరసత్వానికి భూమి పత్రాలు ఆధారం కాదని కలకత్తా హైకోర్టు తీర్పు
40
పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కేవలం భూమి లేదా ఆస్తి పత్రాలు మాత్రమే సరిపోవని కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధమైన చొరబాటు ఆరోపణల ఉన్నప్పుడు ఇలాంటి పత్రాలకు...
సంస్కృత భాషలోని వైజ్ఞానిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
45
తిరుపతి: భారతీయ సంస్కృతి, జ్ఞాన సంపదకు మూలమైన సంస్కృత భాషను అభ్యసించి, అందులో నిక్షిప్తమైన వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్...





