వీర మరణం పొందిన 79వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ సైనికుడు ఎం.సుధాకర్రావుకు నూజివీడు పట్టణం నెహ్రూపేట సామాజిక భవనంలో సీఆర్పీఎఫ్ అధికారుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. 1995 జూన్ 02న మణిపూర్లో తిరుగుబాటుదారులతో జరిగిన ఎన్కౌంటర్లో సైనికుడు సుధాకర్రావు వీరమరణం పొందారు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట సీఆర్పీఎఫ్ కార్యాలయ ఉన్నతాధికారుల ఆదేశంతో నోడల్ అధికారి, ఏఎస్సై మల్లేష్ బృందం నూజివీడు వచ్చి అధికారుల సమక్షంలో సుధాకర్రావు సతీమణి జయమ్మకు, కుటుంబసభ్యులకు సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ సీఐ ఎంవీవీఎస్ మూర్తి మాట్లాడుతూ.. తాను మరణిస్తానని తెలిసి కూడా దేశ, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన వీర సైనికుడు సుధాకర్రావు అని కొనియడారు. వీర మరణం పొందిన సైనికుల జీవితాలు నేటితరం యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
97
You Might Also Like
అక్టోబర్ మూడు నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు
24
దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబు శనివారం పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో అక్టోబర్ మూడు...
ఆర్మీ ప్రత్యేక రైలుని పేల్చివేసే కుట్ర… ట్రాక్పై 10 డిటోనేటర్ల గుర్తింపు
32
దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్నట్టు అనుమానాలు కలిగించేలా వరుస ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దిగ్భ్రాంతి కలుగజేసే మరో పన్నాగం బయటపడింది. ఆర్మీ సిబ్బందితో వెళుతున్న...
సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరం
22
సంప్రదాయ నృత్యాలకు ప్రోత్సాహం అవసరమని టీటీడీ మాజీ మెంబరు సీతారామిరెడ్డి అన్నారు. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామికి నాట్యనీరాజనాలు ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన ఆర్కే కళా సంస్కృతి ఫౌండేషన్...
అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం
(సెప్టెంబర్ 23 - అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం ) అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. వినికిడి...
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
52
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్...
కేదార్నాథ్ నడక దారిలో కుంగిన భూమి
47
కేదార్నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు....