News

జై హనుమాన్‌.. శోభాయమానం

84views

నెల్లూరు నగరంలో హనుమాన్‌ శోభాయాత్ర వైభవంగా జరిగింది. శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను వాహనాలపై కొలువుదీర్చి.. ద్విచక్ర వాహనాల్లో హనుమాన్‌ భక్త బృందం ర్యాలీగా తరలిరాగా- అడుగడుగునా ప్రజలు దీపాలతో హారతులు ఇచ్చారు. పూలవర్షం కురిపించారు. మంగళ వాయిద్యాలు, జై హనుమాన్, జై శ్రీరామ్‌ నామస్మరణ.. విచిత్ర వేషధారణలు, కోలాటాలు, ఆధ్యాత్మిక గీతాలాపనలు, బాణసంచా పేలుళ్ల మధ్య ఏసీ స్టేడియం నుంచి స్టోన్‌హౌస్‌పేట వరకు శోభాయాత్ర సాగింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ పలువురు ముస్లిం యువకులు వీఆర్సీ కూడలిలో శోభాయాత్రలో పాల్గొన్న వారికి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.