News

జపానందస్వామికి రైతుల సన్మానం

97views

అనంతపురం జిల్లాలోని పావగడలో స్థానిక రామకృష్ణ సేవాశ్రమ పీఠాధిపతి జపానందస్వామిని శనివారం రైతు సంఘం ఆధ్వర్యంలో తాలూకాలోని రైతులు శనివారం ఘనంగా సన్మానించారు. గడిచిన మార్చ్‌ నెల నుంచి స్వామి పావగడ ప్రాంతానికి చెందిన రైతుల ఎన్నో వేల పశువులకు గడ్డి పంపిణీ చేసి, రక్షించారని సీనియర్‌ రైతు కెంచగానపల్లి గోవిందప్ప అన్నా. అలాగే స్వామి చళికెర, మొలకలమూరు, గుడిబండ తదితర ప్రాంతాలకు చెందిన ఎన్నో పశువులకు మేత అందంచారన్నారు. ఈ నేపథ్యంలో రైతులు స్వామిజీకి పాదపూజ చేసి సత్కరించారు. స్వామిజీ సేవలు ప్రజలకు మరింత ఉపయోగపడాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సురేష్‌బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో లాయర్‌ భగవంతప్ప, తర్కారి కిష్టప్ప, గంగాధర్‌నాయుడు అనేక మంది రైతులు పాల్గొని స్వామిజిని సన్మానించారు.