News

ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు గ‌డువు పెంపు

95views

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు గ‌డువు జూలై 6వ తేదీ వ‌ర‌కు పెంచినట్లు టీటీడీ తెలిపింది. కళాశాలలో జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 6వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సులో చేర దలచిన విద్యార్థులు కోర్సుల విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637, 9866997290 నంబరులో గానీ కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చని తెలిపింది